Tuesday, April 14, 2020

రామ‌నామ జ‌పం పూర్త‌యింది, శ‌నివారం ధ‌న్వంత‌రి హోమం

గురువుగారు పంపిన చివ‌రి రోజు నివేదిక పంపుతున్నాను. నివేదిక చ‌దివితే అంతా అర్ధం అవుతుంది. అయినా నేను కూడా ఆయ‌న చెప్పిన విష‌యం సంక్షిప్తంగా రాస్తున్నాను. వ‌చ్చే శ‌నివారం ఉద‌యం  ఉద‌యం గురువుగారు ధ‌న్వంత‌రి హోమం చేసి మ‌నంద‌రి గోత్ర నామాల‌తో ప్ర‌క్రియ పూర్తి చేస్తారు. ఆయ‌న పంపిన నివేదికలోని 
"ఓం వాసుదేవాయ విద్మ‌హే వైద్య‌రాజాయ ధీమ‌హి త‌న్నో ధ‌న్వంత‌రి ప్ర‌చోద‌యాత్" 
అనే మంత్రం మ‌నంద‌రం శ‌నివారం ఉద‌యం  ఉద‌యం 7 గంట‌ల‌కు క‌నీసం 11 సార్లు జ‌పం చేస్తే స‌రిపోతుంది. కింద రాసిన బీజాక్ష‌రాల‌తో కూడిన మంత్రం గురూప‌దేశం లేకుండా ఎవ‌రూ చ‌ద‌వ‌కూడ‌దు. అలా చ‌దివితే బెడిసి కొడుతుంది. జాగ్ర‌త్త‌. ఈ నియ‌మం త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. చ‌క్క‌గా ఇన్ని రోజులు పారాయ‌ణ చేసిన త‌ర్వాత ఈ రామ‌నామ పారాయ‌ణ‌లో పాల్గొన్న వారంద‌రి గోత్ర‌నామాలు నివేదిస్తూ మ‌నంద‌రి పేర్ల మీద‌ జ‌రుగుతున్న ఈ హోమం ఇంటిలో ఎవ‌రికీ క‌రోనా ద‌రి చేర‌కుండా కాపాడుతుంది. శుభాకాంక్ష‌లు. 

No comments:

Post a Comment