Friday, December 27, 2013

సఫలైక ఏకాదశి వ్రతం

మనలో చాలా మంది జీవితంలో స్వయం కృతం వల్లనో, ఇతరుల కుట్రల వల్లనో ఇల్లు వాకిలి, ఉద్యోగం వంటివి పోగొట్టుకుని బాధలు పడుతున్నాం... ధర్మబద్ధమైనవి పోగొట్టుకుని తిరిగి వాటిని పొందాలని తపన పడే వారి కోసం ఒక వ్రతం గురించి జీ తెలుగులో చెప్పారు... ఆ వ్రత విధానం మన సుందరకాండ భక్త బృందం కోసం...  

ధర్మబద్ధంగా పోగొట్టుకున్న ఆస్తి, ఇల్లు, ఉద్యోగం వంటివి తిరిగి పొందడానికి... దూరమైన సంతానం, విడిపోయిన కుటుంబంతో పునః సంధానం కోసం...
వ్రత విధానం
మార్గశిర బహుళ ఏకాదశి నుండి అంటే రేపు శనివారం నుండి వచ్చే మార్గశిర బహుళ ఏకాదశి వరకు 25 ఏకాదశులు ఈ వ్రతం చేయాలి..దశమి రోజునే ఈ వ్రతం చేస్తామన్న సంకల్పం చేసుకోవాలి...ఆ రాత్రి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి... ఏకాదశి రోజు ఉదయం లేస్తూనే తలారా స్నానం చేసి లక్ష్మీ నారాయణులకి తులసి దళాలతో పూజ చేయాలి (విష్ణు సహస్ర నామ పారాయణం వంటివి)... రోజంతా ఉపవాసం చేస్తూ నారాయణ జపం చేసుకుంటూ ఉండాలి...రాత్రికి సత్యనారాయణ స్వామి పూజ చేసుకుని నివేదన చేసి ఫలాలు, పాలు మాత్రం తీసుకోవాలి...రాత్రికి జాగారం చేయాలి... నారాయణ జపం కూడా చేయాలి...మర్నాడు ఉదయం ఆఫీస్ లకి వెళ్ళవలసిన వారు ఉండగలిగినంత సేపు జాగారం చేసి పడుకోవచ్చు...మర్నాడు ద్వాదశి ఘడియలు ముగిసిపోకుండానే తిరిగి లక్ష్మీ నారాయణులకి తిరిగి పూజ చేసుకుని, క్షీరాన్నం నివేదన చేసి బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వాలి... లేదా ఏదైనా అనాథ శరణాలయంలో అన్న దానం చేయించవచ్చు...ద్వాదశి ఘడియలు మర్నాడు లేకపోతే ఆ ఘడియలు ఉన్నప్పుడే వ్రతం ముగించుకోవలసి ఉంటుంది...ముఖ్యంగా దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులూ చాప మీద పడుకోవాలి ,,, మత్స్య మాంసాలు తీసుకోకూడదు...బ్రహ్మచర్యం పాటించాలి...ఇలా 25 వారాలు వ్రతం తర్వాత ఉద్యాపన చేసి వ్రతం ముగించవచ్చు...

రాముల వారి భిన్నమైన ఫోటో

రాముల వారి ఫోటోలు మనం ఎన్నో చూశాం... కానీ ఇది అన్నింటి కన్నా భిన్నమైనది... కచ్చితంగా త్రేతా యుగంలో వనవాసం చేసిన రామ లక్ష్మణులు, హనుమ... ఇతర వానరులు ఇలాగె ఉండి ఉంటారు... ఇప్పుడు మనం చూస్తున్నవి ఊహాత్మకమైన ఫోటోలు మాత్రమే అనిపిస్తోంది... అవునా? కాదా...?

Monday, December 2, 2013

5000 దాటిన దేశి హిట్లు

ANOTHER MILESTONE

We are continuously reaching NEW MILESTONES THIS YEAR...By Today ie., 1st DECEMMBER, 2013 we have achieved 5000 Hits from our Motherland India...Total hits globally crossed 8250...This Blog officially launched two years ago @ Sri Pattabhi Ramanjaneya Devasthanam, Pragathinagar, Hyderabad... In two years we have achieved this milestone...In 12 months period ie., from December 2012...we have achieved many milestones...At that time we are @3500 Global Hits...In a period of 12 months we got 4500 Global Hits...Among the majority his are from our MOTHER LAND INDIA...Hits from other countries especially RUSSIA are increasing  day by day...THAT IS THE POWER OF HANUMA...This is the Success of our SUNDARAKANDA FAMILY...HEARTY CONGRATULATIONS TO ALL... 

OUR MILESTONES ARE AS FOLLOWS

1. December 1, 2013                      HITS FROM INDIA CROSSED 5000
2. November 16, 2013                   GLOBAL HITS CROSSED 8000
3. JULY 31, 2013                           GLOBAL HITS CROSSED 7000. 
4. JULY 04, 2013                            INDIAN HITS CROSSED 4000
5. JUNE 16, 2013                           GLOBAL HITS CROSSED 6000
6. MAY 2013                                 RECORD HITS IN A MONTH - 953
7. MAY 31, 2013                           RECORD HITS IN ONE DAY - 81    
8. MAY 26, 2013                           US HITS CROSSED 1000
9. MAY 19, 2013                           GLOBAL  HITS CROSSED 5000
10. APRIL15, 2013                         INDIAN HITS CROSSED 3000
11. JANUARY 17, 2013              GLOBAL HITS CROSSED 4000
12. DECEMBER 20, 2012         GLOBAL HITS CROSSED 3500

(మన బ్లాగ్ కి వచ్చిన హిట్ లను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది మన రాష్ట్రానికే పరిమితం కాలేదండీ. ప్రపంచంలో చాలా దేశాల వారు దీన్ని చూశారు. చూస్తున్నారు.ఈ కింది టేబుల్ చుస్తే ఆ విషయం తెలుస్తుంది).
EntryPageviews
India
     5028
United States
     1633
Russia
       559
Germany
       230
Ukraine
       223
Oman
        73
South Korea
        52
Latvia
        39
Malaysia
        42
UAEmirates
        37

TOTAL HITS      8264

87 వ సుందరకాండ ముగింపు చిత్ర మాలిక


సహస్ర నామార్చనకు కొలువైన స్వామి వారు
సహస్ర నామార్చనకు సంకల్పం చెబుతున్న గురూజీ 
గురూజికి సహాయం చేస్తున్న ప్రభాకర్
గురూజీకి శ్రీనివాస రావు, జ్యోతి దంపతుల సన్మానం

Sunday, December 1, 2013

దామరాజు నిర్వహణలో రుద్రాభిషేకం మరియు 33 వ సుందరకాండము



కర్త దొంతరాజు సావిత్రి
రుద్రాభిషేకం
శ్రీదేవి హనుమత్ స్తుతి
సహస్ర నామార్చన

Saturday, November 30, 2013

ఈ వారం శ్లోకం 7

శ్లో - చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం
      వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః
తా - లంకకు రాగలుగుటకు నలుగురికే సాధ్యము. వాలి పుత్రుడైన అంగదుడు, నీలుడు, బుద్ధిశాలి యగు మా ఏలిక సుగ్రీవుడు మరియు నేను (ఆంజనేయ స్వామి)
వివరణ - ఆంజనేయ స్వామివారు సీతాన్వేషణకై పయనమై త్రికూట పర్వత శిఖరం మీద లంకా నగర ప్రాకారాన్ని చేరుకుంటాడు. దుర్భేద్యమైన లంకను చూసి హనుమంతుడు, దీన్ని దేవతలు కూడా జయించలేరు... ఈ నగరాన్ని చేరుకునే వారిలో పైన వివరించిన నలుగురు మాత్రమే రాగలరు అనుకుంటారు...
వ్యాఖ్యానము - జీవాత్మ అరిషడ్వర్గములచే బంధింపబడి ఉంటుంది. ఆ బంధము నుండి జీవుడిని విముక్తి చేసి తిరిగి పరమాత్మను చేర్చు వాడు ఆచార్యుడే... గురువు ద్వారానే ఈ కార్యము సాధ్యమవుతుంది. ఇక్కడ సీతమ్మ జీవాత్మ... రాముడు పరమాత్మ... రావణుడు అరిషడ్వర్గములు...ఆచార్యుడు ఆంజనేయ స్వామి...రావణుని సర్వ నాశనం చేసి సీతమ్మను రాముని చేర్చు వాడు ఆంజనేయుడు. అనగా అరిషడ్వర్గముల బంధము నుండి జీవాత్మను తప్పించి భగవంతుని చేర్చు వాడు ఆచార్యుడు.
ఇక్కడ మారుతి, నలుగురము మాత్రమే లంకకు రాగలమన్నాడు. వారు అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మరియు తాను... ఇందులో అంగదుడు శక్తి... నీలుడు యుక్తి... సుగ్రీవుడు భక్తి... అంగదుడు ఒకే లంఘనములో శత యోజనముల సముద్రమును దాటి లంకలోనికి ప్రవేశించగలడు... తిరిగి రావడానికి శక్తి పున్జుకోవలసి ఉంటుంది. అది వేరే విషయం. అందు వలన శక్తి ద్వారా అంగదుడు లంకను చేరగలడు. నీటిలో రాయి పడవేస్తే తేలే శక్తి నీలుడుకి ఉంది. అందుచేత లంకకు వారధి నిర్మించి రాగలడు. అనగా యుక్తితో లంకను చేరగలడు. ఇక సుగ్రీవుడు భక్తికి ప్రతీక... వాలి నుండి తన భార్య రుమను, కిష్కింధ సామ్రాజ్యమును రాముడు ఇప్పించినందుకు ఆయనకు విధేయుడయ్యాడు.. కాబట్టి రాముని విధేయుడుగా ఆతను కూడా లంక చేరగలడు. అయితే ఈ మువ్వురిలో ఎవ్వరు కూడా రాక్షసులను తప్పించుకుంటూ సీతాన్వేషణ గావించే శక్తి లేని వారు... వివిధ రూపాలు ధరించి షష్టిర్యోజన విస్తీర్ణమైన లంకలో తిరగగలిగిన శక్తి ఒక్క మారుతికే ఉంది... కాబట్టి జీవాన్వేషణ, అరిషడ్వర్గ బంధ విముక్తి ఒక్క ఆచార్యునికే ఉంటుందని స్వామి వారు ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నారు...
సర్వే జనాః స్సుఖినో భవంతు

Monday, November 18, 2013

సహస్ర దీపోత్సవం


ప్రగతి నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభి రామాంజనేయ ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వ దినాన ద్విశత సుందరకాండల ప్రవచన కర్త శ్రీమాన్ శృంగారం సింగరాచార్యుల వారి ఆధ్వర్యంలో సహస్ర దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది... పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి సుందరకాండ ఆంజనేయ స్వామి వారికి కార్తీక దీపాలు సమర్పించి తరించారు... ఆ కార్యక్రమం దృశ్యాలు...









Saturday, November 16, 2013

వైభవంగా ముగిసిన 87 వ సుందరకాండ


ప్రగతినగర్ శ్రీ పట్టాభి రామాంజనేయ దేవస్థానంలో మన సుందరకాండ ద్వితీయాస్టోత్తర శతంలోని 87 వ సుందరకాండ ఆదివారం సహస్ర నామార్చనతో అత్యంత వైభవంగా ముగిసింది... దామరాజు వెంకటేశ్వర్లు, శ్రీదేవి అనే మా దంపతులకు కర్తలుగా కూర్చునే భాగ్యం లభించింది... ఊహించిన దాని కన్నా అద్భుతమైన స్పందన వచ్చింది... సుమారు 41 మంది కంకణధారణ చేసుకోగా 100 మంది వరకు సహస్ర నామర్చనలో పాల్గొని తరించారు...17 వ తేదిన సహస్ర దీపాలంకరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం కారణంగా తొలి రెండు రోజులు గురూజీ ప్రవచనాలకు కొంత అంతరాయం కలిగినా మంగళవారం నుంచి ప్రవచనాలు సంతృప్తికరంగానే జరిగాయి. అయితే తొలి రెండు రోజులు పూర్తి స్థాయిలో ప్రవచనాలు జరగకపోవడం వల్ల సుందరకాండ తత్త్వం అంతటినీ భక్తులకు సవివరంగా తెలియచేయలేక పోయానన్న స్వల్ప అసంతృప్తి గురువుగారికి ఉండిపోయింది... ఇలా జరగడం సుందరకాండలు ప్రారంభించాక ఇదే తొలి సారి...87వ సుందరకాండ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని  గురువుగారు ఆశీర్వదిస్తున్నారు...
మొదటి రోజు కలశస్థాపన దృశ్య మాలిక ఇది...
వేదికపై కొలువైన స్వామి 
వేదికపై కొలువైన స్వామికి గురూజీ వందనం
దామరాజు దంపతులచే కలశస్థాపన