Wednesday, January 13, 2021

జై హ‌నుమాన్‌


 

భగవంతుడు భక్తసులభుడు అనడానికి నిదర్శనం. ఇరవై ఏళ్ళక్రితం మనచే సుందరకాండ మహోద్యమము ప్రారంభింపజేసిన అంబ‌ర్ పేట ప్రేమ్ న‌గ‌ర్ అభయాంజనేయ స్వామివారు మెల్లమెల్లగా కరోనాను తగ్గిస్తూ మనను లాక్ డౌన్ నుండి విముక్తి చేస్తున్నారు. ఇటీవల నేను అ స్వామిని సందర్శించవలసి వచ్చింది. ఐతే ఆ సమయములో దర్శనాలు పూర్తి అయినందున గర్భాలయానికి తాళం వేశారు. అందుచేత గ్రిల్స్ నుండే స్వామివారిని సందర్శించుకున్నాను. అప్పుడు స్వామివారిని చూస్తుంటే ఏమనిపించిందో తెలుసా మనలను లాక్ డౌన్ నుండి విముక్తి చేయడానికి స్వామివారే స్వయముగా లాక్ డౌన్లోనికి వెళ్లారు అని. .... మన స్వామివారిని భక్త గణానికి దర్శింపజేయడానికే ఈ పోస్టింగును పెట్టాము. 


 మీ శృంగారం సింగరాచార్యులు.