Thursday, April 28, 2016

మ‌ధుర‌ఫ‌ల ప్రియ‌నే...


ఫొటో క‌ర్ట‌సీ : శ్రీ‌మ‌తి  సూర‌వ‌ర‌పు ర‌మాదేవి

Wednesday, April 27, 2016

గురూజీ సందేశం...అంద‌రూ చ‌దివి పాటించి తీరాల్సింది...


ఆప‌ద‌లో ఉన్న వారి కొర‌కు హ‌నుమ‌త్ దీక్ష‌
--------------------------------
తేదీ 23, ఏప్రిల్ 2016 రోజున సాయంత్రం 5.32 నిముషాల‌కు నాకు వాట్స‌ప్‌లో ఒక మెసేజ్ వ‌చ్చింది. అందులో ఇంగ్లీషు అక్ష‌రాల‌తో "గురువుగారికి న‌మ‌స్కార‌ము. ప్ర‌భాక‌ర్‌కి హార్ట్ ఎటాక్ వ‌చ్చింది" అని మాత్ర‌మే ఉంది. పంపిన వారి పేరు లేదు. హార్ట్ ఎటాక్ అను జ‌బ్బు సామాన్య‌మైన‌ది కాదు. క్ష‌ణాల‌లో కొంప‌లు ముంచేస్తుంది. పూర్తి వివ‌రాలు ఆ మెసేజ్ పంపిన వారు తెలుప‌లేదు. సాయంత్రం 5.45 నిముషాల‌కు ఈ మెసేజ్ చూడ‌గానే నాకు ఏమీ తోచ‌లేదు. మొన్న నాతో క‌లిసి శ్రీ సీతారామ క‌ల్యాణంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్ర‌భాక‌ర్‌కు ఇంత తీవ్ర‌మైన అనారోగ్యం క‌ల‌గ‌డ‌మేమిట‌నుకున్నాను. 
నాకు ఏమీ పాలు పోలేదు. 5.55కి వెంట‌నే త‌ల‌పై నీళ్ళ‌ను గుమ్మ‌రించుకుని, ఆ త‌డి గుడ్డ‌ల‌తోనే మా గృహ‌మున‌నే విరాజ‌మానుడై ఉన్న క‌ల్యాణ రాముని ముందు కూచుని, ధ్యాన‌ములో ఉండి, ప్ర‌భాక‌రుకు మృత్యుభ‌య‌ము లేకుండా చూడ‌మ‌ని ప్రార్థించి, వార‌ము రోజుల పాటు నిరాహార దీక్ష‌ను స్వామివారి ముందు ప్ర‌క‌టించాను. 
(భోజ‌న‌ము విస‌ర్జించి సాయంత్ర‌ము ఏడు గంట‌ల త‌రువాత‌నే ఫ‌ల‌ములు మాత్ర‌ము సేవించి నీరు తాగి ఉండ‌డ‌ము)
ఆ త‌ర‌వాత పూర్తి వివ‌రాలు తెలుసుకున్నాను. ప్ర‌భాక‌ర్‌ను సికింద్రాబాద్ య‌శోద‌లో చేర్చిన‌ట్టు, ఆయ‌న ఆరోగ్య‌ము మెరుగుప‌డిన‌ట్టు స‌మాచారం అందింది. ఈ లేఖ మీరు చ‌దివే స‌మ‌యానికి డిశ్చార్జి అయి ఇంటికి చేరిన‌ట్టు కూడా తెలియ‌వ‌చ్చుచున్న‌ది. 
అయినా నా సంక‌ల్ప‌ము ప్ర‌కార‌ము నా దీక్ష 29-4-2016 సాయంత్ర‌ము ఏడు గంటల వ‌ర‌కు కొన‌సాగ‌వ‌ల‌సిన‌దే.
---------------------------------------
భ‌క్త‌గ‌ణ‌మున‌కు నా ప్ర‌త్యేక విన‌తి
మా సుంద‌ర‌కాండ కుటుంబాల‌కు భ‌యంక‌ర‌మైన ఆప‌ద‌లు రాకూడ‌దు. ఇలాంటి భ‌యంక‌ర‌మైన వార్త‌లు మ‌నం విన‌కూడ‌దు. ఈ దీక్ష‌లో మ‌న క‌ల్యాణ రామ‌చంద్రుని ఇవే వేడాను. అయినా, మాన‌వ మాతృల‌ము కాబ‌ట్టి ఇవి అనివార్య‌ము. అయితే ఇలాంటి భ‌యంక‌ర‌మైన విష‌యాల‌ను నాకు తెలియ‌చేయాలంటే ఫోను ద్వారానో, నా ఇ మెయిల్‌కో మెసేజ్ పంపండి. ఆ స‌మ‌స్య‌కు నేను ఏలాంటి స‌ముచిత నిర్ణ‌య‌ము తీసుకోవాలో ఆలోచించే అవ‌కాశ‌ము ఇవ్వండి. ఒక భ‌యంక‌ర వార్త‌ను టెలిగ్రాఫిక్ రూప‌క‌ముగా పంపి, ఆ త‌రువాత నేనే అడిగి తెలుసుకునే అవ‌కాశ‌ము క‌ల్పించ‌కండి.
ఇలాంటి మెసేజ్‌ల వ‌ల్ల‌ నేను వివ‌రాలు తెలియ‌క, ఆదుర్దాలో స్వామివారి స‌న్నిధిన అనుచిత క‌ఠోర దీక్ష‌ను స్వీక‌రించే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇంత‌కు పూర్వ‌ము కూడా నేను మ‌న ప్రియ భ‌క్తుల కొర‌కు నిరాహార దీక్ష‌లు స్వీక‌రించిన సంగ‌తి మీకు తెలుసు. కాని స‌మ‌య‌ము పుష్క‌ల‌ముగా ఉన్నందున అవి ఆలోచించి తీసుకున్న నిర్ణ‌యాలు. 
వ‌యోభార‌ము, భానుని తాప‌ము, ఇటీవ‌ల నాకు జ‌రిగిన ప్ర‌మాద‌ము...ఇవ‌న్నీ నా దీక్ష‌కు ప్ర‌తిబంధ‌కాలు. అయినా స్వామి వారి ఆదేశ‌ము మేర‌కు నిరాహార దీక్ష‌ను కొన‌సాగిస్తున్నాను. 
మ‌న సుంద‌ర‌కాండ భ‌క్తులు కూడా త‌మ‌కు తోచిన విధ‌ముగా మ‌న పురిగిండ్ల ప్ర‌భాక‌ర్ సంపూర్ణ ఆరోగ్య‌వంతుడై మ‌ళ్ళీ మ‌న మ‌ధ్య తిర‌గ‌వ‌ల‌యున‌ని ఆ అంజ‌నీసుతుని కోరండి.
మీ శృంగారం సింగ‌రాచార్యులు
 

Friday, April 15, 2016

గీతా మ‌క‌రందం


ఈ చిన్నారులిద్దరూ కాశీ హిందూ విశ్వ విద్యాలయములలో భారతీయ ధర్మ సంస్కృతులలో పరిశోధన సాగిస్తున్న Prof.జాన్ క్రిస్టఫర్ పిల్లలు..ఈ చిన్నారులిద్దరికి సంపూర్ణ భగవద్గీత కంఠస్తంవచ్చు .!!!!

Thursday, April 14, 2016

"గురు" చాతుర్యం

గురు శ‌బ్దంలో గు అంటే అంధ‌కారం, రు అంటే తొల‌గించ‌డం...అంటే మ‌న‌లోని అంధ‌కారాన్ని తొల‌గించి జ్ఞాన జ్యోతిని వెలిగించే వారే గురువు అని దీని అర్ధం. గురువుల వ‌ద్ద విద్య అధ్య‌య‌నం చేసే వారిలో ప‌లు ర‌కాల శిష్యులుంటారు. కొంద‌రు గురువు ఏం చెబితే దాన్ని తుచ త‌ప్ప‌కుండా పాటిస్తారు. గురువు త‌మ‌ను ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ త‌ప్పుదారిలో న‌డిపించ‌ర‌నే విశ్వాసం వారిది. మ‌రి కొంద‌రు శిష్యులు ప్ర‌తి దాన్ని తార్కిక దృష్టితో చూస్తూ గురువుతో త‌ర్కిస్తూ ఉంటారు. ఆ త‌ర్కంలో త‌మ‌కు సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం అందుకున్న త‌ర్వాత వారు కూడా గురువు చెప్పిన అంశాన్ని తుచ త‌ప్ప‌కుండా ఆచ‌రిస్తారు. అలాంటి త‌ర్కం కూడా ఒక్కోసారి మేలే చేస్తుంది..గురూజీ బోధ‌న‌లోని ఆంత‌ర్యం ఏమిటో ప‌ది మందికి తెలుస్తుంది. స‌త్యం విశ్వ‌వ్యాపితం అవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ క‌థ చ‌ద‌వాల్సిందే... 

ఒక గురూజీ త‌న శిష్యుల‌కి విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం మ‌హాత్మ్యాన్ని బోధిస్తున్నారు.
"శ్రీ‌రామ రామ రామేతి ర‌మే రామే మ‌నోర‌మే
స‌హ‌స్ర‌నామ త‌త్తుల్యం రామ‌నామ వ‌రాన‌నే"
శ్లోకం వ‌ల్లె వేయించి విశిష్ట‌త తెలియ‌చేస్తూ రామ‌నామం మూడు సార్లు జ‌పిస్తే 
స‌హ‌స్ర విష్ణునామ పారాయ‌ణ‌తో స‌మానం అని చెప్పారు.
రామ‌నామం వ‌ల్లె వేస్తున్న శిష్యుల్లో ఒక‌డు గురువు మాట‌తో విభేదించాడు. 
"గురూజీ మూడు సార్లు రామ‌నామం ప‌లికితే వెయ్యి నామాల జ‌పం ఎలా అవుతుంది...? ఆ త‌ర్కం ఏమిటో నాకు అర్ధం కావ‌డంలేద‌"న్నాడు. 
శ్రీ‌రామ‌చంద్రుని  మ‌హాభ‌క్తుడైన గురూజీ అప్ప‌టిక‌ప్పుడే త‌డుముకోకుండా జ‌వాబిస్తూ శ్రీ‌రామ‌నామం వ్య‌వ‌హారంలో ఉన్న ప‌దాల‌న్నింటిలోనూ అత్యంత మధుర‌మైన‌ద‌ని సాక్షాత్తు ప‌ర‌మ‌శివుడే చెప్పాడు. ఆ నామాన్ని ఒక సారి జ‌పిస్తే విష్ణు స‌హ‌స్ర‌నామం ఒక సారి పారాయ‌ణ చేసినట్టు లేదా విష్ణునామం వెయ్యి సార్లు జ‌పించిన‌ట్ట‌వుతుంద‌న్న‌ది ఆ శివుని వాక్కే అన్నారు.
దానికో ఆస‌క్తిక‌ర‌మైన లెక్క కూడా చెప్పారు.
రామ శ‌బ్దాన్ని తీసుకుంటే ర మ‌రియు మ అక్ష‌రాలు క‌నిపిస్తాయి. 
ర (హ‌ల్లుల్లో ఆ వ‌ర‌సలో రెండో అక్ష‌రం...య‌,ర‌,ల‌,వ‌,శ‌,ష‌)
మ ( హ‌ల్లుల్లో ఆ వ‌ర‌సలో ఐదో అక్ష‌రం...ప‌,ఫ‌,బ‌.భ‌.మ‌)
రామ‌లో ఉన్న రెండు ప‌దాల్లోని అంకెల‌ను గుణిస్తే (2X 5) 10 వ‌స్తుంది. 
రామ‌, రామ‌, రామ అన‌డం వ‌ల్ల 2X 5, 2X 5, 2X 5 = 10X10X10 = 1000. ఈ త‌ర్కం ప్ర‌కారం మూడు సార్లు రామ‌నామం జ‌పిస్తే వెయ్యినామ జ‌పం అయిన‌ట్టా, కాదా..? 
గురూజీ లెక్క‌ల‌తో  స‌హా చెప్పిన ఈ త‌ర్కం ఆ కొంటెకోణంగికి బాగా న‌చ్చింది. వెనువెంట‌నే పూర్తి మ‌న‌స్సు పెట్టి విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణ క్ర‌మాన్ని సంపూర్ణంగా అధ్య‌య‌నం చేయ‌డం ప్రారంభించాడు. ఈ త‌ర్కాన్ని ప్ర‌పంచానికి తెలియ‌చేసినందుకు ఆ కొంటె శిష్యుని అబినందించ‌కుండా ఉండ‌గ‌ల‌మా...?