Monday, June 18, 2018

స్వామివారు స్వ‌గృహ ప్ర‌వేశం

స్వామివారు ప్ర‌గ‌తిన‌గ‌ర్ లో సుమారు నెల రోజుల విజ‌య‌యాత్ర ముగించుకుని సోమ‌వారంనాడు (తేదీ 18-06-2018) గురూజీ శ్రీ శృంగారం సింగ‌రాచార్యుల వారి నివాసంలో స్వ‌స్థ‌లానికి త‌ర‌లివెళ్లారు. ప్ర‌గ‌తిన‌గ‌ర్ లో శ్రీ న‌ల్లూరి సురేశ్, శ్రీ దామ‌రాజు వేంక‌టేశ్వ‌ర్లు, శ్రీ పాణ్యం వేణుగోపాల్ గార్ల నివాసాల్లో వైభ‌వంగా పూజ‌లందుకున్నారు. శ్రీ సురేశ్ నివాసంలో మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా పారాయ‌ణ స‌హిత ప్ర‌వ‌చ‌నాలు జ‌రిగాయి. ప్ర‌గ‌తిన‌గ‌ర్ లోని దేవాల‌యాల్లో గ‌తంలో మూడు సార్లు ప్ర‌వ‌చ‌నాలు నిర్వ‌హించిన‌ప్పుడు నిర్వాహ‌కుల అల‌స‌త్వం వ‌ల్ల ఎంతో మ‌నోవ్య‌ధ చెందిన గురూజీకి సురేశ్ నివాసంలో మ‌హ‌దానందం క‌లిగింది. ప్ర‌గ‌తిన‌గ‌ర్ లో ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం భ‌క్తి లేద‌న్న భావం ప‌టాపంచ‌ల‌యింది. శ్రీ సురేశ్ అత్త‌గారైన శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మిగారు దేవాల‌యంలో నిత్యం జ‌రిగే విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణ బృందం స‌భ్యురాలు కావ‌డం వ‌ల్ల ప్ర‌తీ రోజూ 40 మంది వ‌ర‌కు వ‌చ్చి ప్ర‌వ‌చ‌నాలు విని త‌రించారు. ఆ త‌ర్వాత దామ‌రాజు, పాణ్యం వారిళ్ల‌లో జ‌రిగిన హోమ‌రూప‌క సుంద‌ర‌కాండ‌ల‌కు కూడా ఇదే వైఖ‌రి కొన‌సాగింది. ప్ర‌తీ ఇంటిలోనూ వారి ఇంటి విస్తీర్ణం స‌రిపోనంత‌గా భ‌క్త‌జ‌నం వ‌చ్చి కార్య‌క్ర‌మాల్లో పాల్గొని త‌రించ‌డ‌మే కాకుండా మా అంద‌రికీ ఆనందం క‌లిగించారు.  ఆ ర‌కంగా మే నెల 17వ తేదీన గురూజీ ఇంటి నుంచి బ‌య‌లుదేరిన స్వామివారు నెల రోజుల పాటు అద్భుతంగా పూజ‌లందుకుని ఈ రోజు జూన్ 18వ తేదీ నాడు గురూజీ ఇంటికి చేర‌డం మా అంద‌రికీ మ‌హ‌దానందం క‌లిగించింది. మా అంద‌రి జ‌న్మ త‌రించింది. మాకు  ఇంత‌కు మించిన భాగ్యం ఏముంటుంది...జై శ్రీ‌రామ్‌, జై ఆంజ‌నేయ‌.
- దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు