Saturday, April 18, 2020

ఈ రోజు ధ‌న్వంత‌రి హోమం దృశ్యాలు

క‌రోనాసుర సంహారాన్ని కోరుతూ శ్రీ‌రామ‌నామ జ‌పం చేయాల‌న్న మ‌న గురూజీ సందేశం మేర‌కు అంద‌రం రంగంలోకి దిగి మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌రామ‌నామ పారాయ‌ణం ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చేశాము. మొత్తం 300 మందికి పైగా శిష్యులు, వారి బంధుమిత్రులు శ్రీ‌రామ‌నామ పారాయ‌ణ దీక్ష స్వీక‌రించి శ్రీ రామ‌నామం జ‌పించారు. మొద‌ట మార్చి 28 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 8వ తేదీ లోగా కోటి వెయ్యి నూట ఎనిమిది (1,00,01,108) నామాలు పారాయ‌ణ చేయాల‌ని గురూజీ నిర్దేశించారు. అప్ప‌టికే ఆ సంఖ్య దాటిపోయింది. అయినా కూడా ఈ నెల 14 వ‌ర‌కు జ‌పాన్ని గురూజీ పొడిగించారు. ఇంకా తుది లెక్క తెలియాల్సి ఉంది. నా ఉద్దేశంలో అంద‌రం క‌లిసి చేసిన నామ‌జ‌పం 2 కోట్లు దాటిపోయి ఉంటుంది. ఈ రోజున గురువుగారు శ్రీ‌రామ‌నామ జ‌పం చేసిన వారంద‌రి పేర్ల మీద సంక‌ల్పం చెప్పి లోక‌క‌ల్యాణం, స‌ర్వ‌జ‌న క్షేమం, క‌రోనా నుంచి ప్ర‌పంచానికి విముక్తి ఆకాంక్షిస్తూ ధ‌న్వంత‌రి హోమం స‌మీపంలోనే ఉన్న ఒక బ్రాహ్మ‌ణోత్త‌ముని స‌హాయంతో నిర్వ‌హించి సుద‌ర‌కాండ కుటుంబం అంద‌రికీ త‌మ ఆశీస్సులు అంద‌చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు అంద‌రి కోసం పోస్ట్ చేస్తున్నాను.






No comments:

Post a Comment