Monday, February 24, 2020

48వ సుంద‌ర‌కాండ ఆహ్వానం

వ‌చ్చే శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 29) నుంచి మియాపూర్ వాస్త‌వ్యులు గింజుప‌ల్లి ఐన్ స్టీన్‌, ఉమామ‌హేశ్వ‌రి దంప‌తుల ఇంటిలో గురూజీ నిర్వ‌హ‌ణ‌లోని తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌ర‌లోని 48వ సుంద‌ర‌కాండ ప్రారంభం కానుంది. 29వ తేదీ శ‌నివారంనాడు ఉద‌యం సుంద‌ర‌కాండ కంక‌ణ ధార‌ణ ఉంటుంది. ఆస‌క్తి గ‌ల వారంద‌రూ వ‌చ్చి వారం రోజుల కాలానికి సుంద‌ర‌కాండ దీక్షా కంక‌ణం ధ‌రించ‌వ‌చ్చు. ఈ దీక్షా కంక‌ణం తీసుకున్న వారు ఆ 9 రోజులూ ఒక పూట భోజ‌నం చేస్తూ భూశ‌య‌నం చేయాలి. పూర్తి బ్ర‌హ్మ‌చ‌ర్యం వ‌హించాలి. ఇలా చేసిన‌ట్ట‌యితే వారికి ఆంజ‌నేయ‌స్వామి ఆశీస్సులు ల‌భించి వారి క‌ష్టాలు దూరం అవుతాయి. ఇల్లు స‌మృద్ధిగా విల‌సిల్లుతుంది. ఆదివారం (మార్చి 1) ఆ పై శ‌నివారం (మార్చి 7) వ‌ర‌కు నుంచి ప్ర‌తీ రోజూ సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఆంజ‌నేయ అష్టోత్త‌ర శ‌త నామార్చ‌న నిర్వ‌హించి అనంత‌రం సుంద‌రకాండ స‌ర్గ‌ల పారాయ‌ణ‌, త‌ద‌నంత‌రం ఆయా స‌ర్గ‌ల ప్రాశ‌స్త్యం, వాటిలోని ఆంత‌ర్యంపై ధారావాహిక‌గా ప్ర‌వ‌చనం ఉంటాయి. పాల్గొని విని ఆనందించండి.

No comments:

Post a Comment