Sunday, July 15, 2018

20వేలు దాటిన రామ‌నామ జ‌పం


దుష్ట శిక్ష‌ణార్ధం, శిష్ట ర‌క్ష‌ణార్ధం శ్రీ‌మాన్ గురూజీ పిలుపు ఇచ్చిన మేర‌కు మ‌న సుంద‌ర‌కాండ భ‌క్త‌కోటి ఆదివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల మ‌ధ్య‌లో రామ‌నామ‌జ‌పం చేశారు. అలాంటి కొంద‌రు అందించిన స‌మాచారం ఆధారంగా లెక్క క‌డితే 13 మంది 20,478 సార్లు పారాయ‌ణ గావించారు. నిజానికి ఇది ల‌క్ష వ‌ర‌కు చేరి ఉంటే చాలా బాగుండేది. మొత్తం మ‌న భ‌క్త‌బృందం అంద‌రూ కొంత స‌మ‌యం కేటాయించి చేసి ఉంటే అది సాధ్య‌మ‌య్యేది. మ‌రి ఇంత‌మంది మ‌న సుంద‌ర‌కాండ భ‌క్త‌గ‌ణంలో ఏ చిన్న పోస్టుకైనా న‌మ‌స్కార బాణాలు వ‌దులుతూ, త‌మ చిత్తానికి తోచిన‌ ప్ర‌తీ అంశాన్ని వాట్స‌ప్ లో పోస్టు చేసే వారంద‌రూ ఏమైపోయారో అర్ధం కాదు. అయినా రామ‌నామ పారాయ‌ణం 20 వేలు దాట‌డంపై గురూజీ హ‌ర్షం ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరుద్దాం, ఈ సారి గురూజీ నుంచి ఏదైనా ఇటువంటి మ‌హ‌త్కార్యం గురించిన సందేశం అందితే క‌నీసం ల‌క్ష దాటేలా చేద్దామ‌ని నా ఆశ‌.
- దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు

 

No comments:

Post a Comment