Sunday, July 16, 2017

15వ సుంద‌ర‌కాండ ముగింపు చిత్ర‌మాలిక‌

పిల్లారిశెట్టి విజ‌య‌కుమార్ రెడ్డి, మంజుల దంప‌తుల‌ భ‌వ‌నంలో తృతీయాష్టోత్త‌ర ప‌రంప‌రంలోని 15వ సుంద‌ర‌కాండ క్ర‌తురూప‌కంగా విజ‌య‌వంతంగా ముగిసింది. శ‌నివారం ఐదు రోజుల క్ర‌తువు ముగించి పూర్ణాహుతి అయిన అనంత‌రం 16వ తేదీ ఆదివారం సామూహిక విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం, హ‌నుమ‌త్ స్తుతి, రామ‌స్తుతి కార్య‌క్ర‌మాల‌తో పాటు పాణ్యం వేణుగోపాల్ ర‌ఘువీర‌గ‌ద్యం వినిపించి అంద‌రినీ త‌రింప‌చేశారు. భువ‌నేశ్వ‌రి త‌న సుమ‌ధుర గానంతో శ్రోత‌లంద‌రినీ ఆనంద‌ప‌ర‌వ‌శుల‌ను చేసింది. ఆ చిత్రాల మాలిక దిగువ‌న చూడ‌వ‌చ్చు. లైటింగ్ స‌రిగా లేని కార‌ణంగా కొన్ని ఫొటోలు బ్ల‌ర్ అయ్యాయి. మ‌రీ ఎక్కువ‌గా బ్ల‌ర్ అయిన ఫొటోల‌ను తొల‌గించి బాగున్నాయ‌నిపించిన‌వి మాత్ర‌మే ప్ర‌చుర‌ణ‌కు ఎంపిక చేయ‌డం జ‌రిగింది. 


































No comments:

Post a Comment