Tuesday, November 10, 2015

స్వ‌స్థ‌లానికి స్వామివారు

శ్రీ సీతా ల‌క్ష్మ‌ణ హ‌నుమ‌త్ స‌మేత శ్రీ‌రాముల వారు విజ‌యయాత్ర ముగించుకుని ఈ రోజు త‌న స్వ‌స్థ‌లం అయిన గురువుగారి నివాసానికి వేంచేశారు. జూలై 29న ప్రారంభ‌మైన స్వామివారి విజ‌య‌యాత్ర న‌వంబ‌ర్ 10న ముగిసింది. మొత్తం 104 రోజుల్లో 52 మంది సుంద‌రకాండ భ‌క్తుల ఇళ్ళ‌ను పావ‌నం చేశారు. గురువుగారి నిర్వ‌హ‌ణ‌లోని ద్వితీయాష్టోత్త‌ర సుంద‌రకాండ డిసెంబ‌ర్ ఏడో తేదీ నుంచి ప‌న్నెండ‌వ తేదీ వ‌ర‌కు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ప‌రిధిలోని కొత్త‌పేట స‌మీపంలో ఉన్న స‌త్యాన‌గ‌ర్ కాల‌నీ హ‌రిహ‌ర క్షేత్రంలో ఎంతో వైభ‌వంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. అక్క‌డ సేవ‌లు అందుకున్న అనంత‌రం స్వామివారు రెండో ద‌శ విజ‌య‌యాత్ర డిసెంబ‌ర్ 16న ప్రారంభించి 2016 జ‌న‌వ‌రి 18 వ తేదీ వ‌ర‌కు మ‌రో 17 మంది సుంద‌ర‌కాండ భ‌క్తుల ఇళ్ళ‌ను పావ‌నం చేస్తారు. జ‌న‌వ‌రి 19న తిరిగి గురువుగారి నివాసానికి చేరుకుంటారు...

No comments:

Post a Comment