Monday, November 3, 2014

కదళీ వనంలో కార్తిక మాసంలో ఆంజనేయ ఆరాధన

96వ సుందరకాండ క్రతువు రూపంలో నిజాంపేట రోడ్డులోని సద్గురు నిలయంలో రేపటి నుండి అద్భుతంగా జరగబోతోంది...ఈ రోజు సోమవారం ఏకాదశి పర్వ దినాన అంకురారోపణ, హనుమత్ దీక్షా కంకణ ధారణలు ఎంతో వైభవంగా జరిగాయి. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి...  కార్తిక మాసంలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతి పాత్రమైన కదళీ వనంలో హోమ రూపంలో రెండు కుండాలతో క్రతువు జరగడం, పౌర్ణమి పర్వదినాన అంటే వచ్చే గురువారం నాడు తులసి వివాహం,  సహస్ర దీపాలంకరణ, ఆదివారం నాడు సహస్ర నామార్చన, తదుపరి అరటి తోటలోనే కార్తీక వనభోజనాలు...ఇవన్నీ ఒక ఎత్తైతే అక్కడ కపిల గో దర్శనం అన్నింటి కన్నా శ్రేష్టం ..పౌర్ణమి రోజున కపిల గోవును తోటలోనే ఉంచుతారు...ఆ రోజు అందరూ ఆ గోవుకి ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు... ఎంత మంది వీలయితే అంత మంది పాల్గొని పునీతులు కావలసిందిగా గురువుగారి సూచన... 

ఈ దిగువన తొలి రోజు కార్యక్రమాల దృశ్యాలు వీక్షించండి


వీడియోల కోసం ఈ లింక్ చూడండి 



 

No comments:

Post a Comment